అది కనపడలేదు.. ముఖం పచ్చడైంది!

స్కాట్‌లాండ్‌ : ఇన్‌విజిబుల్‌ ఛైన్‌ కారణంగా ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. పరిగెత్తుకుంటూ వచ్చి కిందపడి ముఖం పచ్చడి చేసుకున్నాడు. ఈ సంఘటన స్కాట్‌లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్కాట్‌లాండ్‌ డునూన్‌కు చెందిన జేమీ రే అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం పెర్రీ టెర్మినల్‌  దగ్గర పరిగెత్తుతున్నాడు. అలా పరిగెత్తుతూ ఓ జీబ్రా క్రాసింగ్‌ దగ్గరకు వచ్చాడు. అంతే ఒక్కసారిగా ఏదో తొడలకు అడ్డం తగిలినట్టు బొక్కబోర్లా పడ్డాడు. ముఖం నేరుగా నేలకు తాకింది, అనంతరం శరీరం మొత్తం ఓ రౌండ్‌ పల్టీలు కొట్టి నేలపై పడింది. దీంతో కొద్దిసేపటి వరకు అతడు నొప్పితో అల్లాడిపోయాడు. అటువైపుగా వస్తున్న కొందరు అతడి పరిస్థితి గమనించి అక్కడికి చేరుకునే లోపే జేమీ పైకి లేచాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top