స్కాట్లాండ్ : ఇన్విజిబుల్ ఛైన్ కారణంగా ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. పరిగెత్తుకుంటూ వచ్చి కిందపడి ముఖం పచ్చడి చేసుకున్నాడు. ఈ సంఘటన స్కాట్లాండ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్కాట్లాండ్ డునూన్కు చెందిన జేమీ రే అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం పెర్రీ టెర్మినల్ దగ్గర పరిగెత్తుతున్నాడు. అలా పరిగెత్తుతూ ఓ జీబ్రా క్రాసింగ్ దగ్గరకు వచ్చాడు. అంతే ఒక్కసారిగా ఏదో తొడలకు అడ్డం తగిలినట్టు బొక్కబోర్లా పడ్డాడు. ముఖం నేరుగా నేలకు తాకింది, అనంతరం శరీరం మొత్తం ఓ రౌండ్ పల్టీలు కొట్టి నేలపై పడింది. దీంతో కొద్దిసేపటి వరకు అతడు నొప్పితో అల్లాడిపోయాడు. అటువైపుగా వస్తున్న కొందరు అతడి పరిస్థితి గమనించి అక్కడికి చేరుకునే లోపే జేమీ పైకి లేచాడు.
అది కనపడలేదు.. ముఖం పచ్చడైంది!
Mar 12 2020 10:43 AM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement