గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని చంద్రబాబు ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపి ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అంటున్నాడని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. గారడీ బాబుకు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అయిదేళ్లు అధికారంలో ఉండి అధ్వాన పాలన అందించిన చంద్రబాబును ‘నిను నమ్మం బాబు’ అని సాగనంపాలని పిలుపునిచ్చారు. ‘కేజీ నుంచి పీజీ విద్య, ఆడపిల్ల పుడితే రూ.25 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు ఇస్తామన్న బాబు సర్కారు మాట తప్పింది. టీడీపీకి ఓటు వేయాలని మీ ఇంటికొచ్చిన తెలుగుదేశం నాయకులను అడగండి.
Apr 4 2019 8:10 PM | Updated on Mar 20 2024 5:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement