2400 కిలోమీటర్లు పూర్తి చేసిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Crosses 2400 KM Mark - Sakshi
Sakshi News home page

2400 కిలోమీటర్లు పూర్తి చేసిన వైఎస్‌ జగన్‌

Jun 21 2018 9:40 AM | Updated on Mar 21 2024 7:48 PM

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని లక్కవరం దగ్గర 2400 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆ ప్రాంతంలో ఒక మొక్కను నాటారు. అనంతరం పార్టీ జెండాను జననేత ఎగురవేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement