2400 కిలోమీటర్లు పూర్తి చేసిన వైఎస్‌ జగన్‌

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని లక్కవరం దగ్గర 2400 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆ ప్రాంతంలో ఒక మొక్కను నాటారు. అనంతరం పార్టీ జెండాను జననేత ఎగురవేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top