రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్రమే | Yanamala Ramakrishnudu Comments on YS Jagan Over Kapu Reservation Issue | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్రమే

Jul 31 2018 2:47 PM | Updated on Mar 22 2024 11:06 AM

కాపు రిజర్వేషన్లపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల అంశం కేం‍ద్ర పరిధిలోనిదని, కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై యనమల మంగళవారం మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్పినమాట వాస్తవమే అని, అంతకుమించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని పేర్కొన్నారు. అది రాష్ట్ర పరధిలోని అంశంకాదని, కేంద్రం మాత్రమే రాజ్యాంగ సవరణ చేయగలదని చెప్పారు.
 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement