మహిళ కాపురంలో టిక్‌ టాక్‌ చిచ్చు

సాక్షి, విజయవాడ: పచ్చని కాపురంలో ‘టిక్‌ టాక్‌’ చిచ్చుపెట్టింది.  టిక్‌ టాక్‌ మహమ్మారి ఓ మహిళ కాపురాన్ని కూల్చివేసింది.  సోషల్‌ మిడియాలో బాగా క్రేజ్‌ ఉన్న ‘టిక్‌ టాక్‌’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్‌ టాక్‌ ఇప్పుడు భార్యాభర్తల మధ‍్య ఎడబాటుకు, కలహాలకు కేంద్రంగా మారుతోంది.  సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి జాఢ్యంలా మారి జీవితాల్లో చిచ్చు పెడుతుంది. తాజాగా  ఈ టిక్‌ టాక్‌ మాయలో పడి కట్టుకున్న భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుని...మొదటి భార్యను కడతేర్చేందుకు సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...వీటీపీఎస్‌లో జూనియర్‌ ఫ్లాంట్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సత్యరాజుకు టిక్‌ టాక్‌లో ఓ మహిళ పరిచయమైంది. అది కాస్త  రెండో పెళ్లికి దారితీసింది. అయితే రెండో భార్యతో కలిసి సత్యారాజు చేసిన టిక్‌ టాక్‌ వీడియో మొదటి భార్య కంటపడింది. ఈ విషయాన్ని నిలదీయడంతో పెద్దల సమక్షంలో తప్పు ఒప్పుకుని, మరోసారి అలా జరగదంటూ ప్రాధేయపడ్డాడు. ఆ తర్వాత తన నిజ స్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. పెళ్లై పదేళ్లు అయినా ఇంకా పిల్లలు లేరంటూ మొదటి భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు ఎక్కువ కావడంతో మొదటి భార్య తన తల్లిదండ్రులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top