నల్గొండలో చిరుత కలకలం..

సాక్షి, నల్గొండ: జిల్లాలోని మర్రిగూడ మండలం అజలాపురం గ్రామ శివారులో చిరుత కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత అడవిపందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కుకుంది. స్థానిక రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత ప్రత్యక్షంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో చిరుత కదలికలపై సమాచారమిచ్చినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు.
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top