breaking news
Leopard halchal
-
ఇంట్లోకి చొరబడిన చిరుత
-
హడలెత్తించిన చిరుత
షాద్నగర్ టౌన్/రూరల్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఓ చిరుత హడలెత్తించింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక షాద్నగర్లోని పటేల్ రోడ్డుపై ఒక చిరుతవచ్చింది. అక్కడి నుంచి ప్రై వేట్ ఉద్యోగి మన్నె విజయ్కుమార్ ఇంటిపైకి చే రింది. పైపోర్షన్లో ఉండే ఆయన సోమవారం పా లు తీసుకొచ్చి చూడగా వాటర్ ట్యాంక్ పక్కన చి రుత తోక కనిపించింది. వెంటనే ఆయన ఇంట్లోని తన భార్యకు విషయం చెప్పి బయటకు రావొద్దని అప్రమత్తం చేశాడు. అలాగే కాలనీవాసులతో పా టు 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చాడు. షాద్నగర్ ఏసీపీ సురేందర్, సీఐ శ్రీధర్కుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకొని మరో ఇంటి పైనుంచి చిరుతను పరిశీలించారు. మత్తు మందు ఇచ్చి..: విషయాన్ని పోలీసులు ఫారెస్టు అధికారులతో పాటు హైదరాబాద్ జూపా ర్కు సిబ్బందికి సమాచారమిచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి బీమానాయక్, శంషాబాద్ రేంజ్ ఆఫీసర్ హరిమోహన్రెడ్డి, రెస్క్యూ టీం అధికారి రమేష్కుమార్, జూపార్కు అసిస్టెంట్ డాక్టర్లు అస దుల్లా, అఖిల్, డిప్యూటీ డైరెక్టర్ ఎండీ హకీం ఘట నా స్థలానికి చేరుకున్నారు. రెస్యూ టీం సిబ్బంది చి రుత ఉన్న ఇంటి చుట్టూ వలలు వేశారు. ఉదయం 8కి చిరుత మెట్ల పైనుంచి కిందికి వచ్చి బాత్రూం ఎదుట పడుకుంది. రెస్యూ టీం ఇంటి లోపలికి వెళ్లి బాత్రూం కిటికీ నుంచి ట్రంక్ లైజర్ సాయంతో షూట్ చేసి రెండు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు. చిరుత పరుగులు.. మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన వెంటనే పులి ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టింది. దీంతో కాలనీలోని జనం భయాందోళనకు గురయ్యారు. చిరుత పరుగెత్తే సమయంలో దానికి ఎదురుపడిన కానిస్టేబుల్ లక్ష్మణ్పై పంజా విసరడంతో ఆయనకు స్వల్ప గాయాలవగా.. చిరుత పక్క వీధిలోని ఓ పాడుపడిన గోడల్లో పడిపోయింది. వెంటనే అటవీ సిబ్బంది, రెస్క్యూ టీం దానిని బంధిం చి ప్రత్యేక అంబులెన్సులో హైదరాబాద్లోని జూపార్కుకు తరలించారు. చిరుత విషయం తెలుసుకొని జనం పటేల్ రోడ్డుకు భారీగా తరలివచ్చారు. పట్టుబడిన చిరుత మగదని, రైల్వేస్టేషన్ సమీపంలోని కమ్మదనం అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని డీఎఫ్ఓ బీమానాయక్ అనుమానం వ్యక్తం చేశారు. చిరుతను బంధిస్తున్న దృశ్యం -
నల్గొండలో చిరుత కలకలం..
సాక్షి, నల్గొండ: జిల్లాలోని మర్రిగూడ మండలం అజలాపురం గ్రామ శివారులో చిరుత కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత అడవిపందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కుకుంది. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మత్తు మందు ప్రయోగించి చిరుతను బంధించారు. అనంతరం జూ కి తరలించారు. చిరుత ప్రత్యక్షంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో చిరుత కదలికలపై సమాచారమిచ్చినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. -
తిరుమలలో చిరుత హల్ చల్
తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయ మళ్లీ మంటలు చెలరేగాయి.ఆ అటవీ ప్రాంతంలోని ఓ చిరుత భయంతో తిరుమలలో ప్రవేశించింది. దేవదేవుని దర్శించుకునేందుకు తిరుమల వచ్చిన భక్తులు ఆ చిరుతను చూసి పరుగు తీశారు. ఆ చిరుత ఈవో కార్యాలయం వద్ద హాల్చల్ చేయడంతో అటవీశాఖ, టీటీడీ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాపవినాశనం మార్గంలోని జపాలి తీర్థం సమీపంలోని ట్రాన్స్ఫార్మర్లో మంటలు ఎగసి పడి శేషాచల అటవీప్రాంతంలో మంటలు రాజుకున్నాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ మంటలు ఆర్పేందుకు అటు టీటీడీ, ఇటు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. భక్తుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.