ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు హామీలు నీటి మీద రాతలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి విమర్శించారు. మంగళవారం వైఎస్సార్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట సభల కోసం చివరికి టీటీడీ బస్సులను కూడా వాడుకుంటున్నారని మండిపడ్డారు. వాటిలో మాంసం, మద్యం సరఫరా చేస్తున్నారని.. ఇది క్షమించరాని పాపమని అన్నారు. దీనికి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలికమేనని.. ప్రభుత్వ అధికారులు టీడీపీ నాయకులకు వత్తాసు పలకడం సరికాదని హితవు పలికారు. ఉపాధి హామీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి.. చంద్రబాబు అక్రమాలకు సహకరించి అధికారులు ఇబ్బందిపడొద్దని సూచించారు.
‘చంద్రబాబు హామీలు నీటి మీద రాతలు’
Nov 27 2018 2:07 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement