కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ(47) పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా సంకేతాలిచ్చారు. రాజకీయాల్లో తన పాత్ర ముగిసినట్లేనని తాజాగా మీడియాతో మాట్లాడుతూ సోనియా స్వయంగా వ్యాఖ్యానించారు. 19 ఏళ్ల పాటు ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా బాధ్యతలు నిర్వర్తించారు. సోనియా నేతృత్వంలో రెండుసార్లు యూపీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కుమారుడికి బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నదానిపై ఇటీవల తలెత్తిన సందేహాలపై సోనియా తాజా వ్యాఖ్యలతో తెరపడినట్లయింది.
రాజకీయాల నుంచి తప్పుకోనున్న సోనియా గాంధీ
Dec 15 2017 1:09 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement