ధావన్ వదిలేశాడు..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఫీల్డింగ్ పేలవంగా ఉంది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ ఇన్నింగ్స్ను అరోన్ ఫించ్, ఖాజాలు ఆరంభించారు. అయితే ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే భారత్ రివ్యూను కోల్పోయింది. బుమ్రా వేసిన ఆ ఓవర్ ఐదో బంతి.. ఫించ్ వెనుక కాలి ప్యాడ్లకు తాకింది. దీనిపై భారత అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. దాంతో భారత్ రివ్యూకు వెళ్లింది. ఆ బంతి వికెట్ల పైనుంచి వెళుతుందని తేలడంతో భారత్ రివ్యూ కోల్పోయింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు