అసోం నూతన పౌరసత్వ జాబితా (ఎన్ఆర్సీ)లో 40 లక్షల మంది లేకపోవడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని, ఏ ఒక్క పౌరుడి పట్ల వివక్ష చూపే ప్రసక్తే లేదని, అనవసర వేధింపులు ఉండవని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.