లోకేశ్‌ పర్యటన.. వీధులన్నీ వెలవెల

మంగళవారం రోజున మంగళగిరి మండలంలోని నవులూరు, బేతపూడి, నీరుకొండ, కురగల్లు గ్రామాల్లో లోకేశ్‌ పర్యటించాల్సి ఉంది. అయితే నవులూరులో లోకేశ్‌ పర్యటనకు స్పందన కరువైంది. కేవలం లోకేశ్‌ వెంట వచ్చిన కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఆ ప్రచారంలో కనిపించారు. నవులూరు గ్రామా ప్రజలు లోకేశ్‌ పర్యటనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆయన పర్యటనకు స్పందన లేక.. వీధులన్నీ వెలవెలబోయాయి. దీంతో చేసేదేమీ లేక లోకేశ్‌, ఆయన అనుచరగణం అక్కడి నుంచి వెనుదిరిగినట్టుగా సమాచారం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top