టీడీపీ కష్టాల్లో ఉంది.. ఓటుకు కోట్లు వల్లే ఈ దుస్థితి | Motkupalli Narasimhulu Comments On TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ కష్టాల్లో ఉంది.. ఓటుకు కోట్లు వల్లే ఈ దుస్థితి

Mar 2 2018 4:07 PM | Updated on Mar 22 2024 10:48 AM

సమున్నత ఆశయాలతో నాడు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భ్రష్టుపట్టిపోయిందని టీటీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ప్రస్తుతం టీడీపీ పీకల్లోతు కష్టాల్లో ఉందని, నాయకత్వలోపంతో కొట్టుమిట్టాడుతున్నదని, ఓటుకు కోట్లు కేసు వల్లే ఈ దుస్థితి దాపురించిందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. గత ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినా, తర్వాతి కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడినా అడిగే దిక్కులేకుండాపోయిందని, పరిస్థితి మారాలంటే చంద్రబాబు నాయుడే స్వయంగా తెలంగానలో తిరగాలని సూచించారు.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement