జవాన్ల తల్లులకు నిర్మలా సీతారామన్ పాదాభివందనం | Defence Minister Nirmala Sitharaman touches feet of martyr's mother | Sakshi
Sakshi News home page

జవాన్ల తల్లులకు నిర్మలా సీతారామన్ పాదాభివందనం

Mar 5 2019 9:11 AM | Updated on Mar 22 2024 11:16 AM

పుల్వామా ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్‌ జవాన్ల తల్లులకు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పాదాభివందనం చేశారు. ఉత్తరాఖండ్, డెహ్రాడూన్‌లో సోమవారం జరిగిన ‘శౌర్య సమ్మాన్ సమరోహ్’ కార్యక్రమంలో రక్షణ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర జవాన్ల తల్లులను, సతీమణులను ఆమె ఘనంగా సన్మానించారు. వారిని శాలువతో సత్కరించారు. అనంతరం జవాన్ల తల్లులకు పాదాభివందనం చేసి వారిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement