ఎన్టీఆర్‌ కుటుంబాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు | Actor Mohan Babu Slams CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ కుటుంబాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు

Apr 1 2019 11:46 AM | Updated on Mar 22 2024 11:30 AM

వైస్రాయ్‌ హోటల్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం వాస్తవమని, అది తాను చూశానని సినీనటుడు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు మంచు మోహన్‌బాబు స్పష్టం చేశారు. ‘నేను చేసిన తప్పెంటో చెప్పండి బ్రదర్‌.. తప్పు సరిద్దిదుకుంటాను’ అని వేడుకున్న అన్నగారిపై చంద్రబాబు చెప్పులు వేయించారని మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డితో కలిసి మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. నాయకులందరినీ చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటారని, అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు రక్తంలో జీర్ణించుకు పోయిందని ధ్వజమెత్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement