శ్రీదేవి మృతి సినీ లోకానికి తీరని లోటు | Sakshi
Sakshi News home page

శ్రీదేవి మృతి సినీ లోకానికి తీరని లోటు

Published Sun, Feb 25 2018 11:08 AM

నటి శ్రీదేవి మరణం సినీ లోకానికి తీరని లోటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రోజా తన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నారు. ఏడుకొండలవాడిని దర్శించుకున్న తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ... శ్రీదేవిని ఆదర్శంగా తీసుకుని అనేకమంది సినిమాల్లో నటించటానికి వచ్చారని, అందులో తానూ ఒకరినని చెప్పారు. ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement