ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ప్రజలకు అన్నిరకాలుగా అండగా ఉండాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Jun 17 2014 2:30 PM | Updated on Mar 21 2024 5:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement