రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు:వైఎస్ జగన్ | YS Jagan wants new railway zones for AP | Sakshi
Sakshi News home page

Feb 16 2015 5:15 PM | Updated on Mar 21 2024 8:11 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్లను కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేసినట్లు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ బృందం సోమవారం సురేష్ ప్రభుతో సమావేశమయ్యింది. ఈ భేటీలో వైఎస్ జగన్ తో పాటు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక, పొంగులేటి శ్రీనివాస్, వరప్రసాద్ లు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీకి కొత్త రైల్వే జోన్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. నిధులు లేక ప్రాజెక్టులు ఆగిపోయిన విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించామన్నారు. వాటికి వెంటనే నిధులు కేటాయించి ప్రాజెక్టులను పూర్తి చేయాలని తెలిపినట్లు జగన్ తెలిపారు. తమ వినతులకు ఆయన సానుకూలంగా స్పందించారని జగన్ పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement