'తెలంగాణ ప్రభుత్వమే ఎంసెట్ నిర్వహిస్తుంది' | telanagana-government-to-conduct-eamcet | Sakshi
Sakshi News home page

Jan 2 2015 4:43 PM | Updated on Mar 21 2024 8:52 PM

తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా ఎంసెట్ నిర్వహిస్తుందని విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు కూడా ఎంసెట్ రాసుకోవచ్చని సూచించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 15 శాతం ఓపెన్ కోటా వర్తింపజేస్తామని మంత్రి చెప్పారు. గవర్నర్ నరసింహన్ తో సమావేశమైన అనంతరం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయినా తమపై పెత్తనం చెలాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తోందని జగదీశ్ రెడ్డి విమర్శించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement