దేశ రాజధాని ఢిల్లీ నగరంలో షాకింగ్ విషయం బయటపడింది. ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేయబోయిన 38 ఏళ్ల సునీల్ రస్తోగీ అనే టైలర్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. విచారణ సందర్భంగా మరో దారుణమైన సంచలన విషయం బయటపడింది. గత 12 ఏళ్లలో తాను దాదాపు 500 మంది పిల్లలపై అఘాయిత్యం చేసినట్లు రస్తోగీ తెలిపాడు. ఇదే నేరానికి గాను ఇంతకుముందు 2006 సంవత్సరంలో ఆరు నెలలు జైల్లో కూడా ఉన్నాడు.