కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం తెల్లవాముజామున ఢిల్లీ వీధుల్లో కలియతిరిగారు. సామాన్యులు పడుతున్న నోట్ల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. పాత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో సామాన్య జనం ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారో తెలుసుకునేందుకు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఏటీఎంల ముందు బారులు తీరిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.