కాంగ్రెస్లో అంతర్గత విభేదాల వల్లే తాను ఓడిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ చెప్పారు. 2009 శాసనసభ ఎన్నికల్లో జయసుధ రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి కూడా అదే పార్టీ తరపున అక్కడ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లభించలేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా యూత్ కాంగ్రెస్ను బలోపేతం చేయాలన్నారు. యూత్కాంగ్రెస్కు ఎన్నికలు జరపడం మంచిది కాదని జయసుధ అభిప్రాయపడ్డారు.
Jul 27 2014 5:04 PM | Updated on Mar 22 2024 11:17 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement