తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టు ప్రారంభమైంది. మూడేళ్ల నిషేధపు కట్టు తెంచుకొని పూర్వవైభవంతో సందడి మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం జల్లికట్టును ఉదయం 10గంటలకు అలంగనల్లుర్లో ప్రారంభించారు. ఆయా మంత్రులు మాత్రం తమ తమ ప్రాంతాల్లో ఈ క్రీడను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. సీఎం చేతులమీదుగా ప్రారంభంకానున్న అల్లంగనల్లురులోని జల్లికట్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. శాశ్వత పరిష్కారం వచ్చే వరకు జల్లికట్లు నిర్వహించొద్దని ఆందోళనలు మొదలయ్యాయి. మరోపక్కచ చెన్నై మెరినా బీచ్లో కూడా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టారు.
Jan 22 2017 10:24 AM | Updated on Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement