మైకుల రొద...ఫ్లెక్సీల ఆర్భాటం...జాతరను తలపించే ఊరేగింపులు దాదాపు లేకుండా సాగిన శ్రీలంక పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసి సోమవారం పోలింగ్ జరగబోతోంది. ప్రచారార్భాటం లేకపోవడంవల్ల సాధారణ ఓటరు నాడిని పసిగట్టడం కష్టమైందన్న కొందరు పరిశీలకుల మాటల సంగతలా ఉంచి... గత ఎన్నికల్లో ఖర్చు రాసేసిన మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స దేశ రాజకీయాల్లో మళ్లీ కీలక పాత్ర పోషిస్తాడేమోనన్న గుబులు అందరినీ పట్టిపీడిస్తోంది.