
ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించండి
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్దేశ పూర్వకంగా తమపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తమ పార్టీ అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా భూ ఆక్రమణలను, కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆయన మంగళవారం తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు ఎంపీపీ శేఖర్ యాదవ్పై సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు దాడి చేశారన్నారు. సోమవారం రాత్రి ఎంపీపీ స్థలంలోని నిర్మాణాలను కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రారెడ్డి అనుచరులు, టీడీపీ కౌన్సిలర్ మునీర్ జేసీబీతో పడగొట్టారన్నారు. గత కొద్ది రోజులుగా ఈ స్థలం తనదని శేఖర్ వద్దకు మునీర్ రాగా ఆయన నిజం నిగ్గు తేల్చాలని పోలీస్ స్టేషన్కు దాదాపు 10 మార్లు తిరిగారన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు కావడంతో పోలీసులు అధికార పార్టీకి తలొగ్గి నిజాలను బయటికి వెల్లడించలేదన్నారు. వాస్తవానికి రూ.500 స్టాంప్ పేపర్పై టీడీపీ వర్గీయులు చూ పించిన డాక్యుమెంట్కు సంబంధించిన సర్వే నంబర్ 547 ప్రొద్దుటూరు మున్సి పాలిటీ పరిధిలోని రామేశ్వరం గ్రామ పొలానికి సంబంధించిందన్నారు. ఈ ఆఽ దారాలు కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో లేవని, కేవలం దొంగ సంతకాలు, సీళ్లు వేసి తయారు చేసిన వాటిని చూపుతున్నారన్నారు. ప్రొద్దుటూరులో నకిలీ స్టాంప్లు, దొంగ సంతకాలు వ్యాపారం జోరుగా సాగుతోందని తెలిపారు.
కొత్తపల్లె గ్రామ పంచాయతీలో విచ్చల విడిగా కబ్జాలు
కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సర్పంచ్ శివచంద్రారెడ్డి ఎన్నికై నప్పటి నుంచి విచ్చల విడిగా భూ కబ్జాలు, ఆక్రమణలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ ప్రభావం కారణంగానే అక్కడ అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఒక ముఠా ఏర్పడి దొంగ సంతకాలు, నకిలీ స్టాంప్లు తయారు చేస్తోందన్నారు. ఈ విషయంపై విచారణ జరపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఎంపీపీ, సర్పంచ్ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేకుండాపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఎన్నో భూ ఆక్రమణలను, కబ్జాలు జరిగాయని తెలిపారు. అవినీతి విచ్చల విడిగా పెరిగిపోయిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, జెడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్, ఉప సర్పంచ్ రాఘవేంద్రారెడ్డి, కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, తొగటవీరక్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, ఎంపీటీసీ ఓబయ్య యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు శివ పాల్గొన్నారు.
ఎంపీపీ స్థలానికే దిక్కు లేదు
ఫేక్ డాక్యుమెంట్లపై ఐజీకి ఫిర్యాదు
కొత్తపల్లె పంచాయతీలో విచ్చలవిడిగా భూ కబ్జాలు
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
శివప్రసాదరెడ్డి