వైవీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఆచార్య శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

వైవీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఆచార్య శ్రీనివాస్‌

Jun 1 2025 12:16 AM | Updated on Jun 1 2025 12:16 AM

వైవీయ

వైవీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఆచార్య శ్రీనివాస్‌

కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ప్రొఫెసర్‌ టి. శ్రీనివాస్‌ నియమితులయ్యారు. విశ్వవిద్యాలయ వైస్‌–ఛాన్సలర్‌ ఆచార్య అల్లం శ్రీనివాస రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల పత్రాలను ఆచార్య శ్రీనివాసరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య పుత్తా పద్మ.. శ్రీనివాస్‌కు అందజేశారు. ప్రిన్సిపల్‌ పోస్టుతోపాటూ కడపలోని వై.వి.యు. హాస్టళ్ల (బాలురు, బాలికలు) చీఫ్‌ వార్డెన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇదివరకు ప్రిన్సిపల్‌ , వసతిగృహాల చీఫ్‌ వార్డెన్‌గా పనిచేసిన ఆచార్య ఎస్‌ రఘునాథ్‌ రెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో ఆ బాధ్యతల నుంచి ఆయన రిలీవ్‌ అయ్యారు.

2న డీఈఈ సెట్‌ పరీక్ష

కడప ఎడ్యుకేషన్‌: వైఎస్సార్‌ కడప జిల్లాలో డీఈఈ సెట్‌–2025 (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు)పరీక్ష జూన్‌ 2వ తేదీ 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నామని డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ తెలిపారు. సంబంధిత పరీక్ష మూడు సెంటర్లలో నిర్వహించనున్నామని తెలిపారు. డీఈఈ సెట్‌–25 అభ్యర్థులు హాల్‌ టికెట్లను https://apdeecet. apcfss.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోన్‌ చేసుకోవచ్చని తెలిపారు. నామినల్‌ రోల్స్‌లో పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి ఏవైనా సవరణలు ఉంటే పరీక్షా కేంద్రంలో సరిదిద్దుకోవచ్చన్నారు. హాల్‌ టికెట్‌తో పాటు అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు(ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటర్‌ కార్డు) తమ వెంట పరీక్ష హాల్‌కు తీసుకొని రావాలని తెలిపారు. అభ్యర్థులు వారికి సంబంధిత పరీక్ష తేదీ , సెంటర్‌ను సరిచూసుకుని నిర్ణీత సమయంకంటే అరగంట ముందే పరీక్ష సెంటర్‌కు హాజరుకావాలని డీఈఓ తెలిపారు.

నేడు వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో ‘ఫ్యామిలీ యోగా’

కడప సెవెన్‌రోడ్స్‌: కడపలోని వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియం మైదానంలో ఆదివారం నిర్వహించే ‘ఫ్యామిలీ యోగా‘ కార్యక్రమంలో ఆసక్తి కలిగిన వారు కుటుంబ సభ్యులతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పిలుపునిచ్చారు. ‘యోగాంధ్ర– 2025‘ మాసోత్సవాల్లో భాగంగా.. ప్రత్యేకించి ఈ ఆదివారం (జూన్‌ 1వ తేదీ) ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఫ్యామిలీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులు, అవ్వతాతలు మొదలైన మూడు కేటగిరీలకు చెందిన కుటుంబ సభ్యులు కలిసి పాల్గొనాలని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. జూన్‌ 21 వరకు జరిగే ఈ యోగా కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని, అంతర్జాతీయ యోగా వేడుకలను విజయవంతం చేయాలన్నారు. ప్రతిఒక్కరూ యోగా ఆవశ్యకతను తెలుసుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలన్నారు.

మార్కెట్లకు వరదలా టమాట

బి.కొత్తకోట: ఉమ్మడి చిత్తూరుజిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులకు టమాట వరదలా వచ్చి పడుతున్నాయి. ధరల్లో పెరుగుదల లేనప్పటికి పంట దిగుబడులు భారీగా వస్తున్నాయి. దీంతో శనివారం ఒకరోజే 5,480 టన్నులు విక్రయానికి వచ్చాయి. మదనపల్లె మార్కెట్‌కు 1,750 టన్నులు, వి.కోట మార్కెట్‌కు 132, పలమనేరు మార్కెట్‌కు 460, పుంగనూరు మార్కెట్‌కు 1,568, ములకలచెరువు మార్కెట్‌కు 1,580, బి.కొత్తకోట మార్కెట్‌కు 25 , అంగళ్లు మార్కెట్‌కు 40 టన్నులు వచ్చాయి. కాగా ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో కిలో టమాట రూ.6.20 పైసలు, వి.కోటలో కిలో రూ.7, పలమనేరులో కిలో రూ.7.50 పైసలు, పుంగనూరులో కిలో రూ.6.70పైసలు, ములకలచెరువులో కిలో రూ.8.50 పైసలు పలికింది.

వైవీయూ పీజీ కళాశాల  ప్రిన్సిపల్‌గా ఆచార్య శ్రీనివాస్‌  1
1/3

వైవీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఆచార్య శ్రీనివాస్‌

వైవీయూ పీజీ కళాశాల  ప్రిన్సిపల్‌గా ఆచార్య శ్రీనివాస్‌  2
2/3

వైవీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఆచార్య శ్రీనివాస్‌

వైవీయూ పీజీ కళాశాల  ప్రిన్సిపల్‌గా ఆచార్య శ్రీనివాస్‌  3
3/3

వైవీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఆచార్య శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement