
నూతన వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడి
కడప అగ్రికల్చర్ : జిల్లాలో అనుకూలమైన కొత్త రకాల పంటలను ఎంపిక చేసుకుని నూతన వ్యవసాయ పద్ధతులు పాటింటి అధిక దిగుబడి సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావు సూచించారు. ఊటకూరు కృషి విజ్ఞానకేంద్ర వారు శుక్రవారం వైఎస్ఆర్ జిల్లా కడప మండలం నానపల్లిలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ద్వారా వ్యవసాయ శాఖ అందిస్తున్న పథకాలను ౖరైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీంతోపాటు పచ్చి రొట్టె పైర్లు, జిప్సం మరియు జీవన ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు నూతన వ్యవసాయ పద్ధతులు పాంటించి లాభదాయకమైన దిగుబడి వైపు సాగాలి అని తెలియజేశారు. భారత నూనె గింజన పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ మంగేష్ దుబే మాట్లాడుతూ ఖరీప్ పంటలు సాగు చేసే రైతులు శాస్త్రవేత్తల అధునిక పద్దతులు పాటించి అధిక దిగుబడులను సాధించాలని సూచించారు. ఊటకూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ పంటలసాగులో కీలకం విత్తన ఎంపికేనన్నారు. విత్తన ఎంపికతోపాటు విత్తనశుద్ది, దుక్కులు, ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి సుబాషిణి మాట్లాడుతూ సాధారణంగా సాగు చేసే ఉల్లి నుంచి వినూత్నమైన పంటలైన డ్రాగన్, అంజూరతోపాటు ఇతర పూల పంటల సాగును అలవర్చుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం ద్వారా రైతులకు అందిస్తున్న సూక్ష్మ నీటి పథకం, పాలిహౌస్ పథకాన్ని గురించి వివరించారు. పొద్దుటూరు పశు వైద్యకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి సంబంధించిన వ్యాధులు, టీకాల గురించి వివరించారు. కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు డాక్టర్ సాయి మహేశ్వరి, డాక్టర్ సురేష్ కుమార్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సురేష్ కుమార్రెడ్డి, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి నాగభూషణ్రెడ్డి, మండలం ఉద్యాన అధికారి సింధూరి, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి
అయితా నాగేశ్వరావు