● నాడు గలగల.. నేడు వెలవెల | - | Sakshi
Sakshi News home page

● నాడు గలగల.. నేడు వెలవెల

May 31 2025 1:16 AM | Updated on May 31 2025 1:16 AM

● నాడ

● నాడు గలగల.. నేడు వెలవెల

● ఉచిత బస్సు ‘అదిగో.. ఇదిగో’ అంటూ..

సాక్షి ప్రతినిధి, కడప: ఆ మనిషేం మారలేదు. మారిన మనిషినంటూ జనాన్ని నమ్మించారు. ఓట్లు దండుకున్నారు. అధికారమే పరమావధిగా.. ముఖానికేసుకున్న అపద్ధాల హామీల ముసుగు తొలగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం తక్కువ కాలంలోనే బహిర్గతమైంది. ‘నాడు–నేడు’ వెలుగు కరిగిపోయి, విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం ఆవహించింది. అవును, బాబు మాటలు నీటి మూటలేనని మరోసారి రుజువయ్యాయి. తల్లికి వందనమంటూ ఇప్పటికీ ఊరిస్తున్నారు. నిరుద్యోగ భృతి అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఉండిపోయింది. కర్షకులకు కన్నీరు తుడుస్తానంటూ.. పెట్టుబడి సాయం మాటే మర్చిపోయారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500లు ఊసేలేదు. ఆడబిడ్డ నిధి మాటే ఎత్తడం లేదు. మహానాడు వేధికగా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్‌ గ్యారెంటీ’ కాదు ‘బాబును నమ్మితే మోసం గ్యారెంటీ’ అని రుజువు చేశారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

ఊరువాడా ఊదరగొట్టి..

18 ఏళ్లు నిండిన యువతి నుంచి 59 ఏళ్ల వరకు వయసు గల ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఆడబిడ్డ నిధి చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఊరువాడా చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ఏడాది మునుపు ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్‌ గ్యారెంటీ’ అంటూ ఊదరగొట్టారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేసి తీరుతామని ప్రతి యువతి, మహిళకు ఏడాదికి రూ.18 వేలు చెల్లిస్తామని చెప్పారు. అక్కచెల్లెమ్మల మనసు టీడీపీ వైపు మొగ్గు చూపేలా వ్యవహరించారు. ఆపై ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇప్పటికీ ఆడబిడ్డ నిధి గురించి ఆలోచనే చేయలేదు. మహానాడు వేదికగా ప్రకటిస్తారని భావించిన అక్కచెల్లెమ్మలకు నిరాశే ఎదురైంది. కామధేనువు లాంటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారును పోగొట్టుకొన్నామని మథనపడుతున్నారు.

అమలు చేసింటే రూ.1272 కోట్లు దక్కేది

18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఆడబిడ్డ నిధిగా రూ.1500 చొప్పున టీడీపీ సర్కారు చెల్లించి ఉంటే ఏడాది కాలానికి రూ.18 వేలు వచ్చేది. జిల్లా వ్యాప్తంగా 7,06,974 మంది మహిళలు ఈ పథకానికి అర్హులు కానున్నారు. అంటే ప్రతి నెలా రూ.106.05 కోట్లు.. యువతులు, మహిళలకు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఏడాది కాలానికి రూ.1272.6 కోట్లు దక్కేది. చంద్రబాబు సర్కారు మోసం కారణంగా.. ఆ మొత్తాన్ని మహిళాలోకం కోల్పోయింది. మహిళలు ఆత్మభిమానంతో జీవించాలని, సమాజంలో ఆత్మగౌరవం పెంచేందుకు మునుపటి వైఎస్సార్‌సీపీ సర్కారు అడుగులు వేస్తే.. సీఎం చంద్రబాబు సర్కారు తద్భిన్నంగా వ్యవహరిస్తూ ఏకంగా మహిళాలోకాన్ని వంచనకు గురిచేశారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కాగా, ఇంట్లో ఎంత మంది విద్యార్థులు చదువుతూ ఉంటే అందరికీ రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ ద్వారా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏడాదైనా ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. రాబోవు జూన్‌లో ఇస్తామని మహానాడు వేదికగా మరోమారు ప్రకటించారు. చెప్పిన మాట చెప్పినట్లుగా అమలు చేస్తే జిల్లాలో 3.58 లక్షల మంది విద్యార్థులకు రూ.538 కోట్లు చెల్లించాల్సి ఉంది. పథకం అమలులో ఎలాంటి నిబంధనలు తెరపైకి వస్తాయో వేచిచూడాలి.

పథకం పేరు జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు అందాల్సిన మొత్తం కాలం

ఏడాదైనా నెరవేరని హామీ

ఎదురుచూస్తున్న అక్కాచెల్లెమ్మలు

కూటమి సర్కారు తీరని ద్రోహం

జగనన్న సర్కారులో మహిళలే మహారాణులు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు మహారాణులుగా విరాజిల్లుతూ వచ్చారని విశ్లేషకులు వివరిస్తున్నారు. అమ్మఒడి పథకం ద్వారా 2,16,222 మందికి రూ.912 కోట్లు నాలుగేళ్లలో లభించింది. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రూపేణా మరో రూ.190 కోట్లు అందించారు. మరోవైపు కోట్లాది రూపాయాలు వెచ్చించి.. ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందించారు. మహిళలు మహారాణులుగా అటు సమాజంలో.. ఇటు సొంత ఇళ్లలో గౌరవం పెంచే చర్యలను నాటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ వ్యవహరించిందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణం సదుపాయాన్ని కల్పిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మహిళలు ఇకపై ఎక్కడికెళ్లినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఆశించారు. ఈ హామీ అమలు ‘ఇదిగో.. అదిగో’ అంటూ కాలం గడుపుతున్నారు. జిల్లాలో 6 ఆర్టీసీ బస్సు డిపోల ద్వారా 590 బస్సులు ప్రజా రవాణాలో ఉన్నాయి. సరాసరి ప్రతి రోజు 1.29 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వారిలో 30 శాతం మంది మహిళలు ప్రతి రోజు ప్రయాణించున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే 38,700 మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. తక్కువలో తక్కువంటే సరాసరిగా రూ.100 చార్జీలు చెల్లిస్తున్నారనుకున్నా, ప్రతి రోజు రూ.38.7 లక్షలు మహిళలు చార్జీల రూపేణా భరిస్తున్నారు. అంటే నెలకు రూ.116 కోట్లు మహిళలు భరిస్తున్నారని నిపుణులు వివరిస్తున్నారు.

ఆడబిడ్డ నిధి 7,06,974 (18 ఏళ్లు నిండిన మహిళలు) రూ.106.05 కోట్లు ప్రతి నెల

తల్లికి వందనం 3.58 లక్షలు విద్యార్థులు రూ.538.24 కోట్లు ఏడాది

ఉచిత ప్రయాణం 38,700 (రోజూ ప్రయాణిస్తున్న మహిళలు)ఒకరికి రూ.100 చొప్పున ప్రతి రోజు

రూ.38.7 లక్షలు

ఇంకెప్పుడు ఇస్తారు?

అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. ఆడబిడ్డ నిధి ఊసే లేదు. అసలు పథకం అమలు చేస్తారా? లేదా? నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న సంగతి చంద్రబాబుకు గుర్తుందా? ఇప్పటికైనా ఇవ్వాలి. – సరోజ, కమలాపురం

ఉచిత బస్సు తుస్సు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు తుస్సు అయింది.

– గురుదేవి, ధన్నవాడ, మైలవరం మండలం

పథకాలు పేర్లకే పరిమితం

మహిళలను మోస పుచ్చేందుకు చంద్రబాబు సంక్షేమ పథకాలకు ఆకర్షణీయమైన పేర్లు పెట్టారు. అధికారం పీఠం ఎక్కాక వాటిని అమలు చేయడం మరిచారు.

– గుర్రం లావణ్య, కౌన్సిలర్‌, ప్రొద్దుటూరు

ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు

వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళలందరూ మహారాణులుగా ఉండేవారు. కానీ కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు.

– వనజమ్మ, లింగాలదిన్నెపల్లె, బి.మఠం

● నాడు గలగల.. నేడు వెలవెల 1
1/5

● నాడు గలగల.. నేడు వెలవెల

● నాడు గలగల.. నేడు వెలవెల 2
2/5

● నాడు గలగల.. నేడు వెలవెల

● నాడు గలగల.. నేడు వెలవెల 3
3/5

● నాడు గలగల.. నేడు వెలవెల

● నాడు గలగల.. నేడు వెలవెల 4
4/5

● నాడు గలగల.. నేడు వెలవెల

● నాడు గలగల.. నేడు వెలవెల 5
5/5

● నాడు గలగల.. నేడు వెలవెల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement