ఆర్టీసీ అధికారులతో మంత్రుల సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ అధికారులతో మంత్రుల సమీక్ష

May 27 2025 12:25 AM | Updated on May 27 2025 12:25 AM

ఆర్టీ

ఆర్టీసీ అధికారులతో మంత్రుల సమీక్ష

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప నగర శివార్లలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి కడప జోన్‌లోని వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి బస్సు సర్వీసులను నడపాలని రాష్ట్ర మంత్రులు సూచించారు. సోమవారం ఆర్టీసీ ఆర్‌ఎం, ఈడీ కార్యాలయలలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, నారాయణ సమీక్ష నిర్వహించారు.అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్టీసీ కడపజోన్‌ ఈడీ పైడి చంద్రశేఖర్‌, ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి, కడపజోనల్‌ చైర్మన్‌ నాగరాజుతోపాటు ఆర్టీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

284 మంది గైర్హాజరు

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లావ్యాప్తంగా పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా సోమవారం సాంఘికశాస్త్ర పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 28 పరీక్షా కేంద్రాలకుగాను 1969 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1685 మంది హాజరుకాగా 284 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని పరీక్షా కేంద్రాలను నాలుగు బృందాల ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ 12 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

ఖనిజ నిక్షేపాలపై

కేంద్రం అన్వేషణ

ప్రొద్దుటూరు రూరల్‌ : మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి కొత్తపల్లె గ్రామ పరిసరాల్లో సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారులు ఖనిజ నిక్షేపాల కోసం తవ్వకాలు ప్రారంభించారు. ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని 20 అడుగుల లోతు వరకు బోర్లు వేసి ఖనిజాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇందుకోసం అనేక వాహనాలను ఏర్పాటు చేశారు. ముందుగా సంబంధిత రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకుని పనులను ప్రారంభించారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ పనులు చేపడుతున్నారు. గతంలో హెలికాప్టర్‌ ద్వారా పర్య టించి ఖనిజాలు నిక్షేపాలు ఉండొచ్చని చూపించిన జియోట్యాగ్‌ ఆధారంగా ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు.

నేడు కడపలో జాబ్‌మేళా

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు కడప నగరంలోని తమ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాఽధికారి సురేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ కంపెనీలో ఐటీ, నాన్‌ ఐటీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. 2023, 24, 25 సంవత్సరాలలో ఇంటర్మీడియేట్‌ పాసైన వారు ఇందుకు అర్హులని తెలిపారు. ఎంపికై న వారికి రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు హోదానుబట్టి వేతనం ఉంటుదన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఫోటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మామిడి పంటకు

ధర కల్పించాలి

రైల్వేకోడూరు అర్బన్‌ : రైల్వేకోడూరు మండలంలో మామిడి పంటలకు ధర కల్పించాలని సోమవారం మామిడి రైతులు, వ్యాపారులు స్థానిక ప్రైవేటు మార్కెట్‌ యార్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డు మాజీ అధ్యక్షుడు కె మణి మాట్లాడుతూ జూస్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం మామిడి కాయల కోత తర్వాత కుట్రపూరితంగా ధరలు తగ్గిస్తూ రైతులు, వ్యాపారులు నష్టపోయే విధంగా కు ట్రలు చేస్తోందన్నారు. మామిడి కాయలను తోలుకొని ధరల్లో వ్యత్యాసాలు చూపడం తగదన్నారు. అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు తక్షణమే పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు.

ఆర్టీసీ అధికారులతో  మంత్రుల సమీక్ష 
1
1/1

ఆర్టీసీ అధికారులతో మంత్రుల సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement