
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో మూడు రోజులపాటు జరగనున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాయంత్రం 7:35 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కడప విమానాశ్రయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ ఈజీ అశోక్కుమార్లు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం మహానాడు ప్రాంగణానికి సాయంత్రం 7.40 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు.

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం