పిల్లల సంరక్షణపై దృష్టి పెడదాం | - | Sakshi
Sakshi News home page

పిల్లల సంరక్షణపై దృష్టి పెడదాం

May 26 2025 12:32 AM | Updated on May 26 2025 12:32 AM

పిల్లల సంరక్షణపై దృష్టి పెడదాం

పిల్లల సంరక్షణపై దృష్టి పెడదాం

కడప అర్బన్‌ : పిల్లల సంరక్షణ, పిల్లల అపహరణ, దోపిడీ లేని ప్రపంచాన్ని చూసేలా దృష్టి పెడుతూ ఐసీఎంఈసీ సంస్థ సేవలందిస్తోందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌ఛార్జి చైర్మన్‌ ఎల్‌.వెంకటేశ్వరరావు, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి సి.ఆసిఫాసుల్తానా అన్నారు. తప్పిపోయిన పిల్లల దినోత్సవం సందర్భంగా కడప ప్రభుత్వ బాలుర గృహంలో ఆదివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైంగిక వేధింపులు, పిల్లల దోపిడీ జరగకుండా చూసేలా 1998లో యునైటెడ్‌ స్టేట్స్‌లో ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లయిటెడ్‌ చిల్డ్రన్‌న్‌ (ఐసీఎంఈసీ) సంస్థ ప్రారంభించారన్నారు. ప్రస్తుతం 29 దేశాల్లో పలు సంస్థలు ఈ ఐసీఎంఈసీ పరిధిలో పనిచేస్తున్నాయని తెలిపారు. ఏవైనా సమస్యలుటే జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలన్నారు. అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌లు ప్రవీణ్‌కుమార్‌, రవితేజ మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లలను ఇంటికి తీసుకురావడం. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1098, లీగల్‌ సర్వీసెస్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 15100, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి బాలల సంరక్షణ కొరకు స్నేహపూర్వక న్యాయ సేవలు పథకం 2024, తదితర వాటిపై వివరించారు, విద్య విలువైనదని.. క్రమశిక్షణతో అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమలో మెడికల్‌ ఆఫీసర్‌ జె.లక్ష్మి, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement