ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

May 1 2025 2:09 AM | Updated on May 1 2025 2:09 AM

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ)సమీక్ష సమావేశం కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి.. మరింత విస్తత పరిచేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అయిన పారిశ్రామిక రంగాన్ని.. మరింత అభివద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇండస్ట్రీయల్‌ పాలసీకి అనుగుణంగా జిల్లా ఆర్థిక అభివృద్ధికి దోహద పడేలా జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వనున్నట్లు తెలిపారు.కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగిడాలనుకున్న వారికి ఆర్థిక ప్రాత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లతో సమన్వయం చేయనున్నట్లు చెప్పారు. పరిశ్రమల ప్రమోషన్‌ కు సంబంధించి ఇంకా ఏవైనా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉంటే.. వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై అవగాహన పెంపొందించాలన్నారు.పారిశ్రామిక అభివద్ధి పాలసీ (ఐడీపీ ) 2023–27 ద్వారా ఎస్పీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 19 ట్రాన్స్పోర్ట్‌ వాహనాల ఇన్వెస్ట్మెంట్‌ సబ్సిడీ కింద రూ 1.93 కోట్ల రాయితీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలుపగా.. ట్రాన్స్‌పోర్టు వెహికల్‌కు సంబంధించి తనిఖీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిఎం చాంద్‌ బాషా, ఏపీఐఐసీ జెడ్‌ ఏం శ్రీనివాసమూర్తి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌ రాకేష్‌ చంద్ర, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ సురేష్‌, ఐపివోలీడ్‌ బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ జనార్దన్‌,డిప్యూటీ కమిషన్‌ ఆఫ్‌ లేబర్‌ శ్రీకాంత్‌ నాయక్‌,డిక్కీ కోఆర్డినేటర్‌ శివ శంకర్‌, ఏపీఐఐసీ ప్రతినిధులు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు,అగ్నిమాపక డిడిఆర్‌ఎఫ్‌ అధికారులు,డిటిఓ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖ, ఏపీఎస్‌ పిడీసీఎల్‌ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement