పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి

May 1 2025 2:09 AM | Updated on May 1 2025 2:09 AM

పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి

పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తక్షణమే 12 నెలల పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్‌ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.బుధవారం స్థానిక ఏఐటీయూసీ యూనియన్‌ జిల్లా కార్యాలయంలో యూనియన్‌ అధ్యక్షుడు సునీల్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్‌ బాబు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌ నాగసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 14,000 మంది పనిచేసే ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు 12 నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని వారు ప్రశ్నించారు. పెండింగ్‌ వేతనాలు విడుదల చేయకపోతే కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు సిద్ధమని అన్నారు.10సంవత్సరాలనుంచి గౌరవ వేతనం తో పనిచేస్తున్న సిబ్బిందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సమస్యల పరిష్కారం కోసం తక్షణమే కృషి చేయాలని, మహిళా కార్మికులకు పనిగంటల విధానం అమలు చేయాలని కోరారు.

కడప జిల్లా నూతన కమిటీ ఎన్నిక..

ఆంధ్రప్రదేశ్‌ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కడప జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్‌ బాబు తెలిపారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా నాగసుబ్బారెడ్డి అధ్యక్షుడిగా మాధవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా యామిని లత, ఉపాధ్యక్షుడిగా భాస్కర్‌ రెడ్డి, నరజహాన్‌, జనార్దన్‌, ప్రధాన కార్యదర్శిగా సునీల్‌ కుమార్‌, డిప్యుటీ జెనరల్‌ సెక్రెటరీగా చంద్రమ్మ, సహాయ కార్యదర్శిలుగా ఈశ్వరమ్మ, కాశీ నారాయణ, ప్రసాద్‌ రేడ్డి ట్రెజరర్‌ శ్రీనివాసులు, సలహాదారులు మస్తాన్‌ రెడ్డి, వెంకటేష్‌లను ఎన్నుకున్నారు.

ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement