విద్యలో సమూల మార్పులు రావాలి | - | Sakshi
Sakshi News home page

విద్యలో సమూల మార్పులు రావాలి

May 27 2025 1:50 AM | Updated on May 27 2025 1:50 AM

విద్యలో సమూల మార్పులు రావాలి

విద్యలో సమూల మార్పులు రావాలి

నకిరేకల్‌: విద్యలో మార్పులు రావాలని, ధనవంతుల పిల్లలు, పేదల పిల్లలు ఒకే బడిలో చదువుకోవాలన్నాదే తమ వేదిక లక్ష్యమని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ బడులు నిలబడాలి.. చదువుల్లో అంతరాలు పోవాలనే నినాదంతో తెలంగాణ పౌర స్పందన వేదిక ఽఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాతా సోమవారం నకిరేకల్‌కు చేరుకుంది. ఈ జాతకు స్థానిక టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్య తీవ్ర సంక్షోభంలో ఉందని, సమూల మార్పులతో తగిన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ బడులు నిలబడతాయని, లేకుంటే నాలుగైదు ఏళ్లలో మెజార్టీ బడులు విద్యార్థులు చేరక మూత పడిపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే ప్రజార జాత చేపట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ ప్రతినిధులు తాటిపాముల నర్సింహమూర్తి, ఆర్‌.రాకేష్‌కుమార్‌, పి.జయసాగర్‌, కే.శ్రీనివాస్‌, రవికుమార్‌, ఆర్‌.వెంకన్న, ప్రజా సంఘాల నాయకులు ఎర్పుల తాజేశ్వర్‌, అంజిరెడ్డి, ప్రకాష్‌రావు, వంటెపాక వెంకటేశ్వర్లు, వంటెపాక కృష్ణ, నాగమణి, ఇందిర, రవీందర్‌ తదతరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement