
ప్రైవేట్ అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం
కోదాడ: కోదాడ పట్టణంలోని వివిధ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 1988–2025 వరకు పనిచేసిన ప్రైవేట్ అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కోదాడ సమీపంలోని కొమరబండ వై జంక్షన్ వద్ద నిర్వహించారు. గడిచిన 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నవారు, ఇతర వృత్తుల్లోకి మారిన అధ్యాపకులు ఒక్కచోట చేరి తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ఎస్కే చాంద్పాషా, బూర సైదయ్యగౌడ్, మారం వెంకటరెడ్డి, సుధాకర్రెడ్డి, చందా శ్రీనివాసరావు, రామనర్సయ్య, సనత్కుమార్, నర్సిరెడ్డి, నరేందర్, బడుగుల సైదులు, శేకు రమేష్, నరసింహారావు, వెంకటేశ్వరరెడ్డి, వెంకన్న, దొడ్డా శ్రీధర్, బిక్ష్మాచారి, సనత్కుమార్, శ్యాంసుందర్రెడ్డి, కృష్ణప్రసాద్, ఉపేందర్, వెంకటరెడ్డి పాల్గొన్నారు.