మరో ఉద్యమానికి సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

మరో ఉద్యమానికి సిద్ధం కావాలి

Apr 30 2025 12:53 AM | Updated on Apr 30 2025 12:53 AM

మరో ఉద్యమానికి సిద్ధం కావాలి

మరో ఉద్యమానికి సిద్ధం కావాలి

యాదగిరిగుట్ట : యువతను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ పిలుపునిచ్చారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన ఏఐవైఎఫ్‌ జిల్లా రెండవ మహాసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువ వికాసం పథకానికి 10లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వారందరికి వెంటనే డబ్బులు అకౌంట్లలో వేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో వ్యవసాయ దళిత ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ.. మతోన్మాదానికి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువత నడుం బిగించవలసిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు యాదగిరిగుట్ట పట్టణంలో ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్‌, కొండూరు వెంకటేష్‌, మొగుళ్ల శేఖర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మహాసభలో పలు నివేదికను జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్‌ ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు మహమ్మద్‌ నయీమ్‌, బద్దుల శ్రీనివాస్‌, సుద్దాల సాయికుమార్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ, జిల్లా సమితి సభ్యుడు బబ్బురి శ్రీధర్‌, సీపీఐ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్‌, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు చెక్క వెంకటేష్‌, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, మున్సిపల్‌ మాజీ కో ఆప్షన్‌ సభ్యులు పేరబోయిన పెంటయ్య, ఏఐవైఎఫ్‌ జిల్లా నాయకులు, మహాసభ ఆహ్వాన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఫ ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement