
కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలి
వలిగొండ : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎండ తీవ్రతతో రైతులు ఇబ్బందులు పడకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ హనుమంత రావు సూచించారు. మంగళవారం వలిగొండ మండలంలోని ఎదుళ్లగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులకు తాగు నీరు, టెంట్ సౌకర్యం కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తొందరగా తూకాలు చేసి వెంటనే ఎగుమతులు చేయాలని అన్నారు. ఆదర్శ రైతు వెంకటేష్ సహకారంతో అందజేసిన మజ్జిగను కలెక్టర్ రైతులకు పంపిణీ చేశారు.
రైతులకు ఇబ్బందులు రానీయొద్దు
రామన్నపేట: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది రానీయొద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం రామన్నపేట మండలంలోని బోగారం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ధాన్యం రాశులు, తేమను శాతాన్ని పరిశీలించారు. కొనుగోళ్లు, ఎగుమతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయనవెంట వ్యవసాయ విస్తరణాధికారి కీర్తన ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంత రావు