ఆర్థికాభివృద్ధికి ‘ఉన్నతి’ | - | Sakshi
Sakshi News home page

ఆర్థికాభివృద్ధికి ‘ఉన్నతి’

Apr 28 2025 1:39 AM | Updated on Apr 28 2025 1:39 AM

ఆర్థి

ఆర్థికాభివృద్ధికి ‘ఉన్నతి’

భూదాన్‌పోచంపల్లి: జాతీయ ఉపాధి హామీ పథకంలో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న కూలీలకు అదనపు ఆదాయం వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ‘ఉన్నతి’ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కూలీలకు స్వల్పకాలిక స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలు మండలాల్లో శిక్షణ ఇచ్చారు. తాజాగా భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం, భీమనపల్లి, మెహర్‌నగర్‌ గ్రామాల్లో జాతీయ ఉపాధిహామీ పథకంలో వంద రోజులు పని దినాలను పూర్తి చేసుకొన్న 35 మంది కూలీలను గుర్తించారు. వీరికి జలాల్‌పురంలోని రైతువేదిక భవనంలో ఎస్‌బీఐ ఆర్థిక సహకారంతో, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో 12 రోజుల పాటు అగర్‌బత్తీలు, దూప్‌స్టిక్‌, కుంకుమ తయారీలో శిక్షణ ఇస్తున్నారు.

యూనిట్ల స్థాపనకు సహకారం..

విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధి కూలీలకు శిక్షణ కాలంలో రోజుకు రూ.300 వేతనం, భోజన వసతి, ఉచితంగా యూనిఫామ్‌, మెటీరియల్స్‌, సర్టిఫికెట్లు అందజేస్తారు. తదనంతరం స్వయం ఉపాధి యూనిట్‌లను ఏర్పాటుకు సీ్త్రశక్తి లేదా బ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వం ద్వారా ముద్ర రుణాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. దాంతో సొంతూరిలోనే స్వయంగా యూనిట్లను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందే వీలుంది. అంతేకాక వీరు తయారు చేసిన ఉత్పత్తులను తామే స్వయంగా లోకల్‌ మార్కెట్‌లో విక్రయించుకోవచ్చు. లేదంటే ఉత్పత్తులను విక్రయానికి మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తారు.

యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకు..

ఉపాధిహామీ పథకంలో ఈ 2024–25 సంవత్సరానికి గాను ఉన్నతి పథకం ద్వారా జిల్లాలో 175 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో నారాయణపురం మండలం జనగాంలో జ్యూట్‌ బ్యాగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. వలిగొండ మండలం రెడ్లరేపాక, మోటకొండూర్‌ మండలం మాటూర్‌, రామన్నపేటలో మాత్రం ఉపాధి కూలీలకు డెయిరీ, వర్మీ కంపోస్ట్‌లో శిక్షణ అందించారు. ఇలా కూలీలకు డెయిరీ, అగర్‌బత్తీలు, జ్యూట్‌బ్యాగుల తయారీలో శిక్షణ ఇచ్చారు.

ఉపాధి కూలీలకు అదనపు ఆదాయం చేకూర్చేలా కొత్త పథకం

కూలి పనులు లేని సమయంలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ

ఇప్పటికే నాలుగు మండలాల్లో పూర్తి

పోచంపల్లి మండలం జలాల్‌పురంలో కొనసాగుతున్న శిక్షణ

శిక్షణ అనంతరం యూనిట్ల

ఏర్పాటుకూ రుణాలు

ఉపాధి కూలీలకు వరం

ఉన్నతి పథకం ఉపాధి కూలీలకు వరం లాంటిది. అదనపు ఆదాయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అమలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే కొందరికి శిక్షణ ఇచ్చాం. పోచంపల్లిలో అగర్‌బత్తీల తయారీలో శిక్షణ ఇస్తున్నాం. యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందజేస్తాం.

– కేపీ రాజు, జాబ్స్‌ జిల్లా మేనేజర్‌

ఆర్థికాభివృద్ధికి ‘ఉన్నతి’1
1/2

ఆర్థికాభివృద్ధికి ‘ఉన్నతి’

ఆర్థికాభివృద్ధికి ‘ఉన్నతి’2
2/2

ఆర్థికాభివృద్ధికి ‘ఉన్నతి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement