
జనసేన చేష్టలు బాధాకరం
ఏలూరు (టూటౌన్): మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాన్వాయ్పై జనసేన మూకల వికృత చేష్టలు బాధాకరమని వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు అన్నారు. నగరంలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వేస్లితో కలిసి మాట్లాడుతూ జిల్లాలో క్రిస్టియన్ల సమస్యలపై వైఎస్సార్సీపీ కార్యాచరణ సిద్ధం చేసి భరోసా కల్పించనుందన్నారు. తణుకులో కారుమూరి కాన్వాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అన్నారు.