
చట్టాలపై అవగాహన అవసరం
చింతలపూడి: చింతలపూడి సబ్ జైలును ఆదివారం ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.శ్రీదేవి సందర్శించారు. జైలులో ముద్దాయిలకు అందిస్తున్న ఆహారం, వసతి సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. హింసా మా ర్గాన్ని వీడాలని, సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమును తనిఖీ చేసి ఆహారాన్ని పరిశీలించారు. సబ్జై లు ప్రాంగణంలోని ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్త కార్యదర్శి కె.రత్నప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ మధుబాబు, సబ్ జైలు సూపరింటెండెంట్ కృపానందం, ప్యా నల్ లాయర్ టోకూరి వెంకటేష్, పీఎల్వీటీవీఎస్ రాజు, సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్కుమార్ ఉన్నారు.
నేడు పీజీఆర్ఎస్
భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం జిల్లాలోని కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ప్రజల సమీపంలోని కార్యాలయానికి వెళ్లి అర్జీలు సమర్పించవచ్చన్నారు.
అమలుకాని విద్యాహక్కు చట్టం
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యాహక్కు చట్టం ప్రైవేట్ పాఠశాలల్లో పక్కాగా అమలయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉండగా.. జిల్లాలో పూ ర్తిస్థాయిలో అమలైన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో పిల్లలను చేర్పించుకుంటున్నా వివక్ష చూపుతున్నారని, తల్లిదండ్రుల నుంచి అనధికారికంగా రుసుములు వ సూలు చేస్తున్నారని తెలిపారు. ఫీజుల విషయంలో ఇబ్బందులు పెడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, జిల్లా విద్యాశాఖాధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరారు.
రాట్నాలమ్మకు విశేష పూజలు
పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంట లోని రాట్నాలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో విశేష పూజలు చేయించి మొ క్కులు తీర్చుకున్నారు. ఆలయానికి పూజా రు సుముల ద్వారా రూ.41,100, విరాళాల రూ పంలో రూ.1,401, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.29,805, పులిహోర అమ్మకం ద్వారా రూ.1,380, ఫొటోల విక్రయం ద్వారా రూ.4,165 మొత్తం రూ. 77,851 ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎన్.సతీష్కుమార్ తెలిపారు.