అంజన్నకు అభిషేక సేవ | - | Sakshi
Sakshi News home page

అంజన్నకు అభిషేక సేవ

Jun 29 2025 6:53 AM | Updated on Jun 29 2025 6:53 AM

అంజన్నకు అభిషేక సేవ

అంజన్నకు అభిషేక సేవ

జంగారెడ్డిగూడెం : గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,42,813 సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.

కాలువలో వ్యాన్‌ బోల్తా

భీమవరం అర్బన్‌: భీమవరం పట్టణం నుంచి గొల్లవానితిప్ప రోడ్డులో అభయాంజనేయస్వామి గుడి వద్ద శనివారం రొయ్యల లోడుతో వెళ్తున్న బోలోరో బోల్తా పడింది. వ్యానులో ఉన్న డ్రైవర్‌, ప్యాకింగ్‌ బాయ్స్‌ త్రుటిలో తప్పించుకున్నారు. బోలోరో వాహనాన్ని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు. మలుపు వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటంతో గతంలో భారీ చేపల లారీలు మలుపు తిరిగేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆర్‌ అండ్‌ బీ అధికారులు స్పందించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

వీరవాసరం: రొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్న వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పాలకొల్లు మండలం అరట్లకట్టకు మట్ట ఆదినారాయణ( 57) వీరవాసరం మండలం రాయకుదురులో మడుగు వద్ద రొయ్యల చెరువులపై పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి చెరువుల వద్దకు వెళ్లాడు. చెరువులో ఏరియేటర్లను బిగిస్తూ ఉండగా విద్యుత్‌ మోటార్‌కు ప్రమాదవశాత్తు తగిలి షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వీరవాసరం ఎస్సై రాజ్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement