శాశ్వత బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

శాశ్వత బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు

Jun 29 2025 6:53 AM | Updated on Jun 29 2025 6:53 AM

శాశ్వత బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు

శాశ్వత బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు

ఉంగుటూరు: నారాయణపురం ఆర్‌ అండ్‌ బీ బ్రిడ్జి నిర్మాణ పనులు మూడు నెలల్లో మొదలు పెట్టేందుకు చర్యలు చేపడతామని రోడ్లు, భవనాల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ ఎల్‌.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజనీరు ఎల్‌.శ్రీనివాస్‌రెడ్డి రంధ్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రూ. 20 లక్షలతో తాత్కాలికంగా ఐరన్‌ షీట్‌ వేసి బెయిలీ బ్రిడ్జి నిర్మించడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. శాశ్వత బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపుతామని, అనుమతి రాగానే పనులు మొదలుపెడతామని చెప్పారు. 11 మీటర్ల రోడ్డు, ఇరువైపులా పాదచారులు నడిచేందుకు పుట్‌పాత్‌ డిజైన్‌ రూపొందిస్తామని తెలిపారు. పాడైపోయిన బ్రిడ్జిని పరిశీలించిన అనంతరం రూ.60 లక్షల చేబ్రోలు –తల్లాపురం రోడ్డులో కలిసే పుంత రహదారి అభివృద్ధి కోసం తయారచేసిన ప్రతిపాదిత రహదారిని పరిశీలించారు. చేబ్రోలు పోలీస్టేషన్‌ నుంచి నారాయణఫురం ఊరిలోకి కాలువగట్టు రహదారిని పరిశీలించారు.

త్వరలో పంపుతామని చీఫ్‌ ఇంజినీర్‌ వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement