చీటీల పేరుతో రూ.5 కోట్లకు టోకరా | - | Sakshi
Sakshi News home page

చీటీల పేరుతో రూ.5 కోట్లకు టోకరా

Jun 29 2025 2:19 AM | Updated on Jun 29 2025 2:19 AM

చీటీల పేరుతో రూ.5 కోట్లకు టోకరా

చీటీల పేరుతో రూ.5 కోట్లకు టోకరా

భీమవరం అర్బన్‌: చీటీల పేరుతో తోకతిప్ప గ్రామానికి చెందిన పొన్నాల వీర వెంకట సత్యనారాయణ రూ.5 కోట్ల వరకు మోసం చేసి పరారయ్యాడంటూ భీ మవరం రూరల్‌ స్టేషన్‌ ఎస్సై ఐ.వీర్రాజుకు శనివారం బాధితులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వీర వెంకటరమణ గ్రామంలో నమ్మకంగా ఉంటూ 15 ఏళ్ల నుంచి చీటీల వ్యాపారం చేస్తున్నాడన్నారు. తోకతిప్పతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాల్లో ఆయన చీటీల వ్యాపారం చేస్తున్నాడని, ఆయన కుమారుడు, కుమార్తె ప్రతినెలా వాయిదా సొమ్ములు వసూళ్లు చేసేవారన్నారు. ఇటీవల ఒక్కొక్కరూ 2 నుంచి 5 చీటీల వరకూ వేశామని, చీటీల గడువు ముగియగా వాయిదా ల సొమ్ము ఇవ్వమని అడిగితే రేపు మాపు అంటూ రోజులు గడుపుతున్నాడన్నా రు. కొద్ది రోజులుగా వెంకటరమణ కనిపించడం లేదని, ఆయన భార్య పద్మా వతిని అడిగితే సమాధానం చెప్పకపోగా పోలీసు కేసు పెడతానని హెచ్చరించిందన్నారు. ఈ నేపథ్యంలో వెంకటరమణ కుటుంబంతో సహా కనిపించకుండా పో యాడని, చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఎస్సైను అభ్యర్థించారు. కేసు విచారణ చేసి చర్యలు తీసుకుంటానని ఎస్సై వీర్రాజు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement