
రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు
కర్మాగారం ప్రైవేటీకరిస్తే ఊరుకోం
పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీఐటీయు జిల్లా నాయకులు హెచ్చరించారు. 8లో u
మూలనపడిన ఆక్వా ల్యాబ్
మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆక్వా మొబైల్ ల్యాబ్ సేవలు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంతకాలంగా సేవలు నిలిచిపోయాయి. 8లో u
మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025
అంగన్వాడీల నిరసన గళం
భీమవరం(ప్రకాశం చౌక్): అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎఫ్ఆర్ ఎస్ యాప్ రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం సోమవారం భీమవరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు సోమవారం ధర్నా చేశారు. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలు తరలివచ్చి నిరసన గళం వినిపించారు. అనంతరం జేసీ రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సంఘ జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీలక్ష్మి, కా ర్యదర్శి డి.కల్యాణి, భీమవరం ప్రాజెక్టు లీడర్ సీహెచ్ మహాలక్ష్మి మాట్లాడుతూ సాధారణ ఉద్యోగులుగా ఉన్న తమకు జీఓ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. పనికి తగిన వేతనం చెల్లించాలన్నారు. సీఐటీయూ నాయకులు వారికి మద్దతు తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజారామోహన్రాయ్, జిల్లా కార్యదర్శి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ పరీక్షలకు 81 శాతం హాజరు
భీమవరం: జిల్లాలోని ఐదు కేంద్రాల్లో సోమ వారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలకు 81 శాతం అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఈ.నారాయణ తెలిపారు. ఉదయం సెషన్లో 101 మందికి 92 మంది, మధ్యాహ్నం సెషన్లో 573 మందికి 460 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు.
మున్సిపల్ కార్మికుల సమ్మె
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికులు భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం సమ్మెకు దిగారు. రాష్ట్ర జేఏసీ కన్వీనర్ పిట్టా రాజేష్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమస్యల పరిష్కరం కోసం 34 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దీంతో సమ్మెకు దిగినట్టు చెప్పారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. సంఘ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి. మోహన్రావు, జాయింట్ సెక్రటరీ డి.జయరాజు, కార్మికులు పాల్గొన్నారు.
పనిదినాల పెంపు తగదు
ఆకివీడు: కార్మికుల పనిదినాల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ మండల అధ్యక్షుడు పెంకి అప్పారావు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ సెంటర్లో సోమ వారం కార్మికులతో కలిసి ధర్నా చేశారు. 12 గంటల పనిదినాల వల్ల కార్మికులు శక్తిని కోల్పోతారన్నారు. త్వరగా వృద్ధాప్యానికి గురవుతారని వాపోయారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కార్మికులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిరసనకు బి.రాంబాబు అధ్యక్షత వహించారు.
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం
భీమవరం(ప్రకాశం చౌక్): పీజిఆర్ఎస్కు వచ్చే అర్జీల పరిష్కారం నాణ్యతతో ఉండాలని, నిర్ల క్ష్యంగా ఉంటే చర్యలు తప్పని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖల అధికారు లు ఆన్లైన్ చేయడంతో పాటు తప్పనిసరిగా డైరీలో రాసుకోవాలన్నారు.
అర్జీల్లో కొన్ని..
● భీమవరం నరసయ్య అగ్రహారంలోని పార్క్ సమీపవాసులు డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు లేకపోవడంతో వర్షం నీరు నిలిచి అవస్థలు పడుతున్నామని అర్జీ అందించారు.
● అత్తిలి మండలం ఈడూరుకి చెందిన ఘంట సాయిబాబు వృద్ధాప్య పింఛన్ కోసం వినతిపత్రం సమర్పించారు.
● గణపవరం మండలం చిలకంపాడు చెందిన బొడ్డుపల్లి దుర్గాభవాని తన భర్త మరణించారని, తనని, తన కుమారుడిని భర్త కు టుంబసభ్యులు ఇంటి నుంచి గెంటేశారని న్యాయం చేయాలని కోరారు.
● ఉండి మండలం ఉణుదుర్రుకు చెందిన న్యా యవాది సుందరకుమార్ గ్రామంలోని ఎ స్సీ పేటలోని పంచాయతీ చెరువు కలుషితంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు టౌన్: ప్రజలను ఏమార్చడంలో చంద్రబాబు నిపుణుడని, రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బెదిరింపులు, భయపెట్టడం, అక్రమ కేసులు, నెలల తరబడి జైళ్లలో ఉంచేలా చేస్తూ రివేంజ్ రాజకీయాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సోమ వారం ఏలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరులో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక ఫైర్స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్లోని ఆరు హామీలు పూర్తి చేశా నని చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారన్నారు. జగన్ ఐదేళ్ల ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు 20 ఏళ్లు ముఖ్యమంత్రి అయినా ఒకటేనని, కేవలం ఐదేళ్లలోనే జగన్మోహన్రెడ్డి రూ.3 లక్షల కోట్ల మొత్తాన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు పంచితే చంద్రబాబు మాత్రం ఒక ఏడాదికే 1.30 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. చంద్రబాబు గతంలో హామీలు అమలు చేయాల్సిన సమయంలోనూ హ్యాపీ సండే, దోమలపై దండయాత్ర అని డైవర్షన్ రాజకీయాలు చేశారని, ఇప్పుడేమో పథకాలడిగితే యోగాంధ్ర, ఊపిరి బాగా తీసుకోవాలంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పోలవరం నిర్మాణానికి ఖర్చు పెట్టిన దాని కంటే పోలవరం ప్రాజెక్టును అందరికీ చూపించడానికి రూ.100 కోట్లు ఖర్చు చేశారని, పని కంటే పబ్లిసిటీ ఎక్కువని విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్రతి నియోజకవర్గంలో వంద మంది యువతకు రూ.10 లక్షల చొప్పున ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించారని, దానిని ఆయన మరచిపోయారన్నారు. కనీసం మీడియా, ప్రజలైనా దీనిపై ప్రశ్నించాలని సిద్ధార్థరెడ్డి కోరారు.
నిరుద్యోగ భృతి రూ.57 వేల కోట్ల బకాయి
రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కొడుకుకు మాత్రం ప్రతిసారీ ఉద్యోగం ఇస్తున్నాడు గానీ నిరు ద్యోగ యువతను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగులను వంచించారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి ఈ ఏడాదికి సంబంధించి రాష్ట్రంలోని నిరుద్యోగ యు వతకు రూ.57 వేల కోట్లు చెల్లించాలని, లేదంటే వైఎస్సార్సీపీ యువత పోరును నిరంతరం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2.50లక్షల మంది వలంటీర్లను తొలగించారని, ఎండీయూలో పనిచేస్తున్న 15 వేల మందికి ఉపాధి తీశారని జక్కంపూడి రాజా మండిపడ్డారు.
ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు?
గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని, నేడు కూటమి పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
బాబు పాలనలో ప్రజలకు కష్టాలే..
సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారనీ, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, చివరకు వ్యాపారులు సైతం నష్టాల్లో ఉన్నారని పార్టీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్కుమార్ అన్నా రు. కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు చేసేందుకు ఇంజనీరింగ్ ఫీజులు సైతం పెంచేశారని ఆరోపించారు. తల్లికి వందనం పథకంలో 87 లక్షల మంది తల్లులు అర్హులు కాగా 57 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూర్చడం కూటమి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు.
కదం తొక్కి.. నిరసన తెలిపి..
వైఎస్సార్సీపీ యువత పోరుకు భారీ ఎత్తున యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు పోటెత్తారు. వేలాదిగా తరలిరావడంతో ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్ స్తంభించింది. ఉదయం 9.30 గంటలకే జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి శ్రేణులు తరలివచ్చారు. పార్టీ జెండాలు, ప్లకార్డులు, ప్లెక్సీలతో యు వత కేరింతలు కొడుతూ భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఫైర్స్టేషన్ సెంటర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యు వజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్థార్థ రెడ్డి, ఏలూరు పా ర్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్, సమన్వయకర్తలు మామిళ్లపల్లి జయప్రకాష్ (ఏలూరు), కంభం విజయరాజు (చింతలపూడి), పుప్పాల వా సుబాబు (ఉంగుటూరు), తెల్లం బాలరాజు (పోలవరం) దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా ఎన్ఆర్పేట, జెడ్పీ కార్యాలయం రోడ్డులో నుంచి కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్ వద్ద ౖబైఠాయించి కొద్దిసేపు ధర్నా చేశారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసు లు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పార్టీ నేతలు ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు.
ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముంగర సంజయ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గాదిరాజు మణికంఠ కిషోర్, కోటగిరి సందీప్, బసవ వినయ్, దాలి వెంకటేష్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, జెడ్పీ వైఎస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, జెడ్పీ వైస్ చైర్మన్ జి.కృష్ణంరాజు, జెడ్పీటీసీలు నిట్టా లీలా నవకాంతం (దెందులూరు), భవానీ (భీమడోలు), కోడే వెంకట కాశీ విశ్వనాథ్ (నిడమర్రు), జయలక్ష్మి (ఉంగుటూరు), హేమ కుమారి (పోలవరం), కడిమి రమేష్ (కామవరపుకోట), పోల్నాటి బాబ్జీ (జంగారెడ్డిగూడెం), జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితా రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు పిల్లా చరణ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజేష్, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు, అంగన్వాడీ అధ్యక్షురాలు శైల స్వాతీ యాదవ్, లీగల్సెల్ అధ్యక్షుడు అల్తి శ్రీనివాసరావు, సోషల్ మీడియా అధ్యక్షుడు చిక్కాల దుర్గాప్రసాద్, బూత్ కమిటీ అధ్యక్షుడు చింత అనిల్కుమార్, ప్రచార కమిటీ అధ్యక్షుడు చిలుకూరి జ్ఞానరెడ్డి, ఆర్టీఐ అధ్యక్షుడు స్టాలిన్బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, పోలవరం నియోజకవర్గ అధ్యక్షుడు జైబాబు, దెందులూరు యువజన అధ్యక్షుడు పెద్దిరాజు, కై కలూరు యువజన అధ్యక్షుడు చార్లెస్, జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకీ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అప్పనవీడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
న్యూస్రీల్
బెదిరింపులు, అక్రమ కేసులు, జైళ్లతోనే పాలన
కూటమి పాలనలో తలలు నరికితే తప్పు లేదా?
వైఎస్సార్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
ఏలూరులో యువత పోరుకు కదం తొక్కిన నిరుద్యోగులు
భారీ ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు

రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు