
నత్తనడకన రీ సర్వే
ఇండోర్ స్టేడియం.. నిండా నిర్లక్ష్యం
ఏలూరు ఇండోర్ స్టేడియం గత వైభవాన్ని కోల్పోతోంది. ప్రభుత్వ ఉదాసీనత, నిధుల కొరతతో పాటు అధికారుల నిర్లక్ష్యానికి నిలువటద్దంగా మారుతోంది. 8లో u
సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025
భీమవరం(ప్రకాశం చౌక్): భూ వివాదాల పరిష్కారంతో పాటు.. ప్రభుత్వ భూముల్ని అక్రమణల నుంచి రక్షించడానికి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూముల రీ సర్వే చేపట్టారు. నూరేళ్ల తర్వాత భూముల రీసర్వే చేసే మహన్నోత కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. రాష్ట్రంలోనే జిల్లా రీ సర్వేలో ప్రథమ స్థానంలో నిలిచింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో రీ సర్వే మందకొడిగా సాగుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రీ సర్వే కొనసాగిస్తున్నా.. వేగంగా జరిగేలా మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ 12 నెలల కాలంలో 20 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని కేవలం 35 వేల ఎకరాలల్లో భూ సర్వే పూర్తి చేశారు. ఇంతరకు ఒక రైతుకు కూడా భూ హక్కు పత్రాలు ఇవ్వలేదు. గతంలో 100 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తే.. ఈ ప్రభుత్వం కేవలం 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. దాంతో రీసర్వే నాణ్యత లేకుండా తప్పుల తడకగా సాగే అవకాశం ఉంది. కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూల నుంచి రైతులు, ఇతరులు భూ సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారు. రీసర్వే జరగని గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో ఈ ఫిర్యాదులు వస్తున్నాయి. భూ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను అధికారులు పరిష్కరించ లేకపోతున్నారు.
క్లస్టర్ విధానంతో కష్టాలు
ప్రభుత్వం రెవెన్యూ గ్రామాల రేషలైజేషన్ పేరిట రెండు మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ చేయడానికి చర్యలు చేపట్టింది.
దానికి తోడు క్లస్టర్కు ఒక సర్వేయర్, ఒక వీఆర్వో ఉండేలా ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో సిబ్బంది తక్కువగా ఉండడం గ్రామంలో భూ విస్తరణ ఎక్కువగా ఉండడంతో భూ రీ సర్వే వేగంగా జరగడం కష్టంగా మారింది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు, ఆ సంఘం నాయకులు కూడా చెబుతున్నారు. ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సర్వేయర్, వీఆర్వోపై పని ఒత్తిడి పెరిగిపోతోందని సర్వేకు తగిన సిబ్బంది ఉండాలని అసలు క్లస్టర్ విధానంలో అనేక లోపాలు ఉన్నాయని వాపోతున్నారు.
న్యూస్రీల్
ఏడాదిలో 20 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి
ఒక్క రైతుకూ అందని భూ హక్కు పత్రాలు
గత ప్రభుత్వంలో మూడేళ్లలో 2.2 లక్షల ఎకరాల్లో రీ సర్వే పూర్తి
70 వేల మంది రైతులకు పత్రాలు అందజేత
ఆక్రమణలోని దేవదాయ భూమి గుర్తింపు
జిల్లాలో భూ రీసర్వే ద్వారా దేవస్థానాలకు చెందిన 301 ఎకరాల భూమిని ఆక్రమణ చెర నుంచి రక్షించారు. జిల్లా వ్యాప్తంగా 8095.74 ఎకరాల దేవదాయ శాఖ భూములు ఉండగా నాడు అధికారుల లెక్కల ప్రకారం 301.81 ఎకరాల భూములు అక్రమణల్లో ఉన్నాయి.
గత ప్రభుత్వంలో 2.2 లక్షల ఎకరాల సర్వే
గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో జిల్లాలో మూడేళ్లలో 2,22,934 ఎకరాల్లో భూ రీసర్వే పూర్తి చేశారు. 70 వేల మంది రైతులకు భూహక్కు పత్రాలు అందజేశారు. జిల్లా మొత్తం 5.15 లక్షల ఎకరాల సర్వే లక్ష్యం కాగా మూడు దశల్లో 2.2 లక్షల ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. 1,15,354 ఎకరాల్లో సరిహద్దు రాళ్లు పాతించారు. సర్వే చేసిన భూవిస్తరణ, హద్దులతో ఆన్లైన్ కూడా చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో కేవలం 35 వేల ఎకరాలు సర్వే చేసింది. సర్వే పూర్తిచేసిన భూమికి సంబంధించి ఒక రైతుకు కూడా భూహక్కు పత్రాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఏడాది కాలంలో 64 వేల ఎకరాల్లో సర్వే పూర్తి చేసి 36,400 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించారు.

నత్తనడకన రీ సర్వే

నత్తనడకన రీ సర్వే