మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ

May 26 2025 1:13 AM | Updated on May 26 2025 1:13 AM

మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ

మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ

భీమవరం: యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడంలో మాస్టర్‌ ట్రైనర్ల పాత్ర కీలకమని జేసీ టి.రాహుల్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం జాయింట్‌ కలెక్టరు ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండో రోజు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా ఢిల్లీ ఆధ్వర్యంలో వర్చువల్‌ విధానంలో మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ కొనసాగింది. విద్యా, ఆయుష్‌ శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమంలో మొదటి రోజు సుమారు 100 మంది మాస్టర్‌ ట్రైనర్లకు యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 200 మంది యోగా ట్రైనర్లకు మెరుగైన శిక్షణ ఇచ్చి నెలరోజులపాటు గ్రామ, వార్డు స్థాయిలోని ప్రజలకు యోగా ప్రాధాన్యత తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందించారు. యోగా గురువులు ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, బీహెచ్‌ఇ సత్యనారాయణ రాజు, పీఎస్‌డీ భవాని శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, టూరిజం శాఖ అధికారి ఎ.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement