
ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక
భీమవరం (ప్రకాశంచౌక్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా యూనిట్ సమావేశం ఆదివారం నిర్వహించారు. జిల్లా యూనిట్ కార్యవర్గ కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా వై.మోహనరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎస్కె ఉమర్ ఆలీ షా, ఉపాధ్యక్షులుగా జీవీ రామనాగు, ఎస్.మానస, ఎంవీ లక్ష్మీనారాయణ, ఎం.సదాశివ ప్రసాద్, కే.కనకరాజు, ఎం.వెంకటేష్, ఎం.సాయిబాబా, వి.రాజేష్ కుమార్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జి.జక్కరయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్వీఎస్ వాసు పులగండం, సహాయ కార్యదర్శులుగా ఎండీ అస్గర్ అలీ, కే మాణిక్యాలరావు, సీహెచ్ రాజేష్, జి.నారాయణ, జి.ప్రసాద్, ఎం.పద్మిని, కోశాధికారిగా పి.నాగభూషణం ఎన్నికయ్యారు.
మహిళల క్రికెట్ జట్ల ఎంపికకు సన్నాహాలు
ఏలూరు రూరల్: మే 31, జూన్ 1న భీమవరం డీఎన్నార్ కళాశాల గ్రౌండ్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలికల క్రికెట్ జట్ల ఎంపిక చేపట్టనున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అడహక్ కమిటీ సభ్యులు ఆర్ఎస్ఆర్ మూర్తి, ఈ.అశోక్కుమార్, ఎస్కె సాఖీర్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–15 విభాగంలో బాలికలు సెప్టెంబర్ 1, 2010 తర్వాత పుట్టి ఉండాలన్నారు. అండర్–19 విభాగంలో మహిళలు సెప్టెంబర్ 1, 2006 తర్వాత, అండర్–23 విభాగంలో సెప్టెంబర్ 1 2002 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారిణులు తమ వయసు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ఆధార్తో పాటు సొంత క్రికెట్ కిట్తో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. జట్లకు ఎంపికై న వారు ఏసీఓ పర్యవేక్షణ జరిగే అంతర జిల్లా క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. మరింత సమాచారం కోసం 70136–33143 నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
కిటకిటలాడిన రాట్నాలమ్మ దేవస్థానం
పెదవేగి: రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి, విశేష రీతిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కుబడులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వారం అమ్మవారికి మొత్తం రూ.1,01,960 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్కుమార్ తెలిపారు.