
కేసులతో భయపెట్టలేరు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి
యలమంచిలి: వైఎస్సార్ సీపీ నాయకులను తప్పుడు కేసులతో భయపెట్టలేరని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీపై నెల రోజుల వ్యవధిలో ఐదు కేసులు పెట్టడంతో ఆదివారం ఆయన్ను ప్రసాదరాజు కలిసి సంఘీభావం తెలిపారు. కూటమి నాయకులు అధికారం అడ్డం పెట్టుకుని పోలీసు కేసులు పెట్టగలరేమో కానీ, న్యాయస్థానంలో వాటిని రుజువు చేయలేరని ముదునూరి అన్నారు. ఇటువంటి కేసులకు వైఎస్సార్ సీపీ శ్రేణులు భయపడరని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, కోర్టులో చివరికి న్యాయమే గెలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పార్టీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి), పాలకొల్లు పట్టణ అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కొరగింజల హనుమంతరావు, దిద్దే చిట్టిబాబు, చోడగిరి రమేష్, చెన్ను విజయ్, పాలపర్తి కృపనాథ్, రావి పృధ్వీ తదితరులు ఉన్నారు.