
సంక్షేమం, అభివృద్ధికి వెన్నుపోటు
సీ వీడ్.. సో గుడ్
సముద్రపు నాచు (సీ వీడ్) తీరప్రాంత మహిళలకు కుటీర పరిశ్రమగా మారుతోంది. తక్కువ కాలంలోనే అధిక దిగుబడులు సాధించే నాచు పెంపకానికి డిమాండ్ పెరుగుతోంది. 8లో u
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
ఈ హామీల ఊసే లేదు
● జనవరిలో ఆచంటలో టీడీపీ రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆచంట మండలం అయోధ్యలంక–కోడేరు మధ్య గోదావరిపై వారధి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయోధ్యలంకలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు.
● ఏప్రిల్ 05: పాలకొల్లు సభలో చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రావణ మాసంలో జిల్లాలో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని రోడ్డన్నింటిని బాగుచేస్తామన్నారు.
● ఏప్రిల్ 10: తణుకులోని నరేంద్ర సెంటర్ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తణుకులో హైటెక్ టవర్ నిర్మిస్తామన్నారు. ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తెస్తామని చెప్పారు. తణుకును పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, వలసలు అరికడతామని వాగ్ధానం చేశారు.
● ఏప్రిల్ 21: నరసాపురం, భీమవరం సభల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వశిష్ట గోదావరిపై వంతెన పనులు ప్రారంభిస్తామన్నారు. భీమవరంలో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తామన్నారు. వీరవాసరం మండలం, భీమవరం మండలాల్లోని శివారు గ్రామాలకు తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
● ఏప్రిల్ 29: తాడేపల్లిగూడెం వారాహి సభలో పవన్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంను మార్కెట్ హబ్గా, ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. మిలటరీ మాధవరం–తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టు భూములను అన్యాక్రాంతం నుంచి కాపాడతామన్నారు. మిలటరీ ఉద్యోగుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయిస్తామన్నారు.
● మే 10: ఉండిలో చంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో భూగర్భ జలాలు కలుషితమైనందున విజ్జేశ్వరం నుంచి ప్రొజెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా స్వచ్చమైన తాగునీటిని కుళాయిల ద్వారా ఇంటింటికి ఇస్తామన్నారు. యూనిట్ కరెంట్ రూ.1.50కే ఇచ్చి ఆక్వా రంగాన్ని పైకి తెస్తానన్నారు. అవసరమైన చోట్ల 500 టన్నులు కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తామన్నారు. ఏరియేటర్స్పై సబ్సిడీ ఇప్పిస్తానన్నారు. ఆకివీడులో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి లేదా ఫ్లై ఓవర్ నిర్మిస్తామని హామీలు గుప్పించారు. ఏడాది పాలన ముగుస్తున్నా.. ఒక్క హామీ అమలుచేసే దిశగా చర్యలు తీసుకోలేదు.
టీడీపీ నేతలకు పండుగ
గ్రామాల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధి కోసం పల్లె పండుగ పేరిట రూ.46.48 కోట్లు ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను కూటమి నేతలే దక్కించుకున్నారు. ప్రజావసరాల మేరకు రోడ్లు నిర్మాణం చేయాల్సి ఉండగా చాలాచోట్ల తమ భూముల విలువ పెంచుకునేలా ఖాళీ స్థలాలు, పొలాలు, చెరువులకు రోడ్లు వేయించుకోగా గత టీడీపీ హయాంలో చేసిన రోడ్లకు కొత్తగా మెరుగులు దిద్ది బిల్లులు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మరమ్మతుల్లోనూ మోసం
రోడ్లను అద్దంలా చేస్తామన్న హామీని అటకెక్కించిన కూటమి ప్రభుత్వం కనీస మరమ్మతులకు చేతులెత్తేసింది. జిల్లాలో 698 కి.మీ మేర మరమ్మతుల కోసం రూ.42.57 కోట్లు మంజూరు చేసింది. సంక్రాంతి నాటికి గుంతలు లేకుండా చేస్తామని చెప్పగా ఇప్పటికి పూర్తికాని పరిస్థితి. నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా చాలాచోట్ల నాసిరకంగా పనులు చేని ప్రజాధనాన్ని కాజేశారు. కొన్నిచోట్ల గుంతల్లో కంకర, చిప్స్ వేసి తారు వేయకుండా వదిలేశారు. వాహనాల తాకిడికి రాళ్లు పైకిలేచి మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలాయి.
అధికారులు న్యాయం చేయాలి
ఓఎన్జీసీ అధికారులు న్యాయం చేయాలని రైతులు ఆందోళన చేశారు. రైతులకు కేవలం ఒక పంటకు మాత్రమే డబ్బులు వేశారని ఆరోపిస్తున్నారు. 8లో u
ఆడబిడ్డకు అన్యాయం
మహిళలకు ప్రతీ నెల రూ: 1500
జిల్లాలో రూ.1500 పొందేందుకు అర్హులు – 5,96,313
ఆడబిడ్డ నిధి పథకం కింద ఏడాదిలో నష్టపోయిన మొత్తం
రూ. 1073 కోట్లు
తల్లికి నష్టం
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్ విద్యార్థులు : 2,49,662
అర్హులైన విద్యార్థులు (70 శాతం) సుమారు : 1,74,763 మంది
తల్లికి వందనంగా గత విద్యా సంవత్సరంలో తల్లులు నష్టపోయిన మొత్తం
రూ. 262.14 కోట్లు
అన్నదాత దుఃఖీభవ
జిల్లాలో సాగు భూమి : 2.3 లక్షల ఎకరాలు
రైతులు : 1,24,645
అన్నదాత సుఖీభవ అందక గత సీజన్లో రైతులు నష్టపోయిన సాయం
రూ. 249.29 కోట్లు
నిరుద్యోగులకు అందని భృతి
జిల్లాలో కుటుంబాలు : 5.17 లక్షలు
రూ.3000 ఆర్ధిక సాయం కోసం ఎదురుచూపు
మొత్తం రేషన్కార్డులు : 5,67,651
ఒక్కో కార్డుపై ఏడాదికి మూడు చొప్పున ఇవ్వాల్సిన గ్యాస్ సిలెండర్లు : 17,02,953
గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కటి చొప్పున ఇచ్చిన సిలెండర్లు : 5,67,651
లబ్ధిదారులు కోల్పోయిన సిలెండర్లు : 11,35,302
గ్యాస్ ధర రూ. 827.50. ఆ మేరకు గత ఏడాది నష్టపోయిన మొత్తం రూ.93.94 కోట్లు
ఉచిత బస్ తుస్సు
జిల్లాలో మొత్తం జనాభా 19,00,228
పురుషులు : 9,48,461
మహిళల జనాభా : 9,51,766
ఎన్నికల హామీ మేరకు మహిళలందరికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి.
న్యూస్రీల్
ఎన్నికల్లో హామీల వరద పారించిన కూటమి నేతలు
ఏడాది పాలనలో ఒక్క హామీని అమలు చేయని వైనం
కూటమి దగాపై జూన్ 4ను ‘వెన్నుపోటు దినం’గా ప్రకటించిన వైఎస్సార్సీపీ
నియోజకవర్గ కేంద్రాల్లో నేడు నిరసన కార్యక్రమాలు
తొలి ఏడాదే నవరత్నాలు అమల్లోకి తెచ్చిన జగన్ సర్కారు
ఐదేళ్లలో పేదలకు రూ.11,333.57 కోట్ల లబ్ధి
అంతన్నారు.. ఇంతన్నారు.. అధికారంలోకి రావడమే ఆలస్యం.. సూపర్ సిక్స్ అంటూ ఊరూరా ఊదరగొట్టారు. జూన్ నుంచే అమలు.. ఇవిగో బాండ్లు అంటూ కూటమి నేతలు ఏ కుటుంబానికి ఎంత వస్తుందో కరపత్రాలపై రాసి మరీ ఇంటింటికీ ఇచ్చేశారు. కూటమి పాలన చేపట్టి ఏడాదైనా సూపర్ సిక్స్ జాడలేదు. కూటమి వంచనకు నిరసనగా జూన్ 4ను ‘వెన్నుపోటు దినం’గా వైఎస్సార్సీపీ ప్రకటించింది. ప్రజల పక్షాన నియోజకవర్గ కేంద్రాల్లో నేడు నిరసన తెలుపనుంది.
– సాక్షి, భీమవరం
విజయవంతం చేయాలి
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి వంచనతో పాలన సాగిస్తోంది. ప్రజల పక్షాన బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి.
– ముదునూరి ప్రసాదరాజు,
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
వంచనకు ఏడాది
కూటమి ప్రభుత్వ వంచన పాలన మొదలై అప్పుడే ఏడాది. ఎన్నో వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఈ ఏడాదిలో ఒక్క హామీని అమలుచేయకుండా నమ్మి ఓట్లేసిన ప్రజలను దగా చేశారు. సంక్షేమాన్ని విస్మరించి కూటమి సాగిస్తున్న అరాచక పాలనకు నిదర్శనమే ‘వెన్నుపోటు దినం’.
– ముదునూరి మురళీకృష్ణంరాజు,
వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్

సంక్షేమం, అభివృద్ధికి వెన్నుపోటు

సంక్షేమం, అభివృద్ధికి వెన్నుపోటు

సంక్షేమం, అభివృద్ధికి వెన్నుపోటు