
బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు
తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని ఎల్.అగ్రహారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో బుధవారం రాత్రి జరగాల్సిన బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరపల్లి గ్రామానికి చెందిన బాలికకు, దేవరపల్లి మండలం బంధపురం గ్రామ వాసితో బుధవారం రాత్రి బాలిక అమ్మమ్మ స్వగ్రామం ఎల్.అగ్రహారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి 1098 నెంబరుకు కాల్ రావడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ కే దుర్గాభవాని, కే విశాలాక్షి, మహిళా పోలీస్, అంగన్వాడీ కార్యకర్తలు బాలిక అమ్మమ్మ ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం బాలికను తణుకులోని బాలసదన్కు తాత్కాలిక వసతి నిమిత్తం తరలించినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ కే దుర్గాభవాని తెలిపారు.
6 నుంచి హాకీ పోటీలు
భీమవరం: భీమవరం పట్టణంలోని డీఎన్నార్ కళాశాల ఆవరణలో ఈనెల 6వ తేదీ నుంచి 15వ హాకీ ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఉమెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీఎస్ భరత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని 15 టీమ్లు పాల్గొంటాయని, విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు ఆగస్టులో కాకినాడలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు టీమ్ను ఎంపిక చేస్తామన్నారు.
సుజుకి న్యూ యాక్సెస్ 125 విడుదల
ఏలూరు (టూటౌన్): శ్రీ కృష్ణా సుజుకి ఆధ్వర్యంలో హోటల్ ఎన్ ఏలూరులో న్యూ యాక్సెస్ 125 టీఎఫ్టీ కలర్డ్ డిస్ప్లే వేరియంట్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేశారు. అధునాతన ఫీచర్లతో దీనిని లాంచ్ చేశారని, దీనికి ఏడేళ్ల ఎక్స్టెండెడ్ వారంటీ ఉందని, వంద మంది లక్కీ విన్నర్లతో పాటు గ్యారంటీ రివార్డుగా రూ.5 వేలు అందిస్తున్నామని శ్రీ కృష్ణా గ్రూప్స్ అధినేత నారా శేషు తెలిపారు. కార్యక్రమంలో సుజుకి కంపెనీ సేల్స్ అండ్ సర్వీస్ రీజనల్ మేనేజర్లు శివరామకృష్ణ, సునీల్, ఏరియా సేల్స్ మేనేజర్ అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం బెల్ట్షాపు నిర్వాహకుడి అరెస్ట్
భీమవరం: భీమవరం మండలం, పట్టణంలో నిర్వహిస్తున్న బెల్ట్షాప్పై ఎకై ్సజ్ అధికారులు దాడి చేశారు. బెల్ట్షాప్ నిర్వాహకుడు సీహెచ్ శ్రీనును అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ కె.బలరామరాజు బుధవారం తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సైలు పి ఉమామహేశ్వరరావు, పి సునీల్ కుమార్ పాల్గొన్నారు.

బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు